‘విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు’

by  |
Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. దీక్ష చేపట్టిన పల్లా శ్రీనివాస్‌ను దీక్ష విరమింపజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… గత ఆరు రోజులుగా శ్రీనివాస్ దీక్ష చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ 5 లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు. అంతేగాకుండా విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారని వెల్లడించారు. ఎందరో ప్రాణత్యాగాలతో విశాఖ స్టీల్‌ప్లాంట్ వచ్చిందని, స్టీల్‌ప్లాంట్ లేకపోతే విశాఖ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరామర్శలో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు, చినరాజప్ప, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.



Next Story

Most Viewed