చంద్రబాబు గరం గరం.. ఏపీ ఎస్ఈసీకి లేఖ..

by  |
Chandrababu
X

దిశ, వెబ్‌డెస్క్ : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. దీంతో ఆదివారం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు లేఖ రాశారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని అందులో పేర్కొన్నారు.

అంతేకాకుండా, రిజక్ట్ చేయడానికి గల కారణాలను అధికారులు చెప్పడం లేదని మండిపడ్డారు. శ్రీకాళహస్తిలోని 33 పంచాయతీల్లో నామినేషన్లు తిరస్కరించారని.. వారిపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా SECని కోరారు.అలాగే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని వినతి చేశారు.


Next Story

Most Viewed