కుప్పంలో చంద్రబాబు ప్రజావిశ్వాసం కోల్పోయారు

by  |
Redappa
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయాడని చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ కోర్టుల ద్వారా సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లో్ ఆయన చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. పరిషత్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో బహిష్కరణ పేరుతో కొత్త నాటకానికి తెరదీశారని ధ్వజమెత్తారు. ఎన్నికలు బహిష్కరించే వాళ్లు టీడీపీ బీ ఫాంతో ఎలా ఎన్నికల్లో పోటీ చేశారని ఎంపీ రెడ్డప్ప ప్రశ్నించారు.


Next Story