వైసీపీ నేతలు నా భార్య క్యారెక్టర్‌ను కించపరిచారు.. చంద్రబాబు కన్నీరు

by  |
babu
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనస్తాపం చెందారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీఎల్పీ సమావేశంలో చర్చించిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. తన కుటుంబం పట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య భువనేశ్వరి తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని.. అలాంటి తన భార్య క్యారెక్టర్‌ను కించపరిచేలా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారని ఇది తనను ఎంతో బాధించిందన్నారు.

తన రాజకీయ జీవితంలో ఎంతోమంది నాయకులను చూశానని కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలను భరించలేకపోతున్నట్లు తెలిపారు. ఏపీ అసెంబ్లీ అనేది కౌరవసభలా తయారైందని ఆరోపించారు. ఈ సభకు గౌరవం లేదన్నారు. గతంలో ఆవేశాలకు ఆవేశాలు ఉండేవని.. సమావేశం వాయిదా పడేదని.. లేదంటే స్పీకర్ చర్చించి ఎవరిది తప్పు ఉంటే ఆ తప్పును సరిదిద్దేవారన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం తన తల్లిని దూషించారని.. ఈ విషయంపై అసెంబ్లీలో తాను గట్టిగా నిలదీస్తే వైఎస్ఆర్ క్షమాపణలు కోరిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.


Next Story