చంద్రబాబు ఫేక్​ ప్రతిపక్ష నేత: కొడాలి నాని

by  |
చంద్రబాబు ఫేక్​ ప్రతిపక్ష నేత: కొడాలి నాని
X

దిశ, ఏపీ బ్యూరో: 9 ఏండ్ల పాలనలో చంద్రబాబు పింఛన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచలేదని మంత్రి కొడాలి నాని అన్నారు. టీడీపీ హయాంలో ఎంతిచ్చారో తమకు తెలుసని చెప్పారు. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలను ఇవ్వాలని సూచించారు.

ఎవరో ఒకరి పొత్తు లేకుండా పోటీచేయలేని వ్యక్తి చంద్రబాబుని ఎద్దేవా చేశారు. పారిపోయే వారు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. తమ ప్రభుత్వం ఒకటో తేదీనే పింఛన్ ఇస్తోందనీ, వైఎస్ఆర్ భరోసా పథకం ద్వారా అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నామని వెల్లడించారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు పింఛన్లు ఇవ్వనున్నామని వివరించారు. చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రతిపక్ష నాయకుడనీ… టీడీపీ ఫేక్ పార్టీ అన్నారు.


Next Story

Most Viewed