నిరుద్యోగులకు మరో రెండు వారాల పాటు ఛాన్స్..

by  |
నిరుద్యోగులకు మరో రెండు వారాల పాటు ఛాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 220 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే గడువు తేదీ ఆగస్ట్ 4న ముగిసింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తు గడువును పొడిగించాలని అభ్యర్థుల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో అప్లికేషన్ డెడ్‌లైన్‌ను ఆగస్ట్ 19 వరకు పొడిగించినట్లు నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ వెల్లడించింది.

తాజా నిర్ణయంతో అభ్యర్థులకు మరో 2 వారాల పాటు అవకాశం దొరికింది. అప్లికేషన్ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతతో అసిస్టెంట్ (లీగల్), మేనేజ్‌మెంట్ ట్రైనీ, సీనియర్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ, ట్రైనీమేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://www.indiaseeds.com/ వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలని కోరింది.

Next Story

Most Viewed