‘పట్టంకడితే.. తాకట్టుపెట్టారు’

by  |
‘పట్టంకడితే.. తాకట్టుపెట్టారు’
X

దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజానీకం టీఆర్‌ఎస్‌కు పట్టం కడితే ప్రజల ఆత్మాభిమానాన్నితాకట్టు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. సోమవారం తెలంగాణ ప్రవాసులతో (కాంగ్రెస్) ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీవో నంబర్ 203తో ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా జల దోపిడికి ప్రయత్నిస్తున్నా సీఎం కేసీఆర్ నోరుమెదపడం లేదన్నారు. కాళేశ్వరం జలాలతో కేసీఆర్ తన కుటుంబ కన్నీళ్లు తుడుచుకున్నాడే తప్పా.. ప్లోరైడ్ ప్రాంత‌మైన దక్షిణ తెలంగాణను పట్టించుకోలేదన్నారు. ప్రవాస కాంగ్రెస్ ప్రతినిధులు గంగసాని రాజేశ్వర్‌రెడ్డి, కృష్ణ చైతన్య, అనిల్ రావు, రాజశేఖర్‌రెడ్డి , రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed