సివంగిలా గర్జించిన వీరవనిత చాకలి ఐలమ్మ

by  |
సివంగిలా గర్జించిన వీరవనిత చాకలి ఐలమ్మ
X

దిశ, తాండూరు: వంగి దండాలు పెట్టే రోజుల్లో సివంగిలా గర్జించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ 35వ వర్ధంతిని పురస్కరించుకొని పరిగిలో ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఐలమ్మ కొంగు నడుముకు చుడితే దొరతనం తోక ముడిచిందని.. కొడవలి చేతబడితే పీడిత జనం కడలిలా తరలివచ్చారన్నారు. చాకలి తెగింపుతోనే వెట్టిచాకిరీ ముగింపునకు వచ్చిందని పేర్కొన్నారు.

Next Story

Most Viewed