- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు ఒక మైనర్తో పాటు మరొకరిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 17న తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్ పేరుతో నడుపుతున్న వాట్సాప్ గ్రూప్లో సీఎం పేరుతో తప్పుడు వార్త ఒకటి పోస్ట్ అయ్యింది. దానిని ఓ మైనర్ ఇతర గ్రూపులకు కూడా షేర్ చేశాడు.
దీనిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వనస్థలిపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న 16 ఏళ్ల బాలుడితో పాటు తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్ గ్రూపుకు తప్పుడు వార్తను పోస్ట్ చేసిన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నె గ్రామానికి శేఖర్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.
Next Story