- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైన మరో పార్టీ
<p>దిశ, అంబర్పేట్: తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఆపకపోతే మరో భూ పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరణి వల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని వెంటనే సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు అనేక ఎకరాలు ఆక్రమించారని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచాలని […]</p>

X
దిశ, అంబర్పేట్: తెలంగాణ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఆపకపోతే మరో భూ పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరణి వల్ల అనేక నష్టాలు కలుగుతున్నాయని వెంటనే సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు అనేక ఎకరాలు ఆక్రమించారని వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచాలని సూచించారు. జీవో 13ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీ నుంచి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ శాఖలలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేవలం 50 వేలు మాత్రమే చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Next Story






