- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశీయ విమాన సేవలకు అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేట్ హెలికాప్టర్లు, జెట్లు, చార్టర్డ్ ఫ్లైట్ల సేవలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశీయ విమాన సేవలు అందుబాటులోకి వచ్చిన సోమవారం నుంచే ఈ సేవలకూ పర్మిషన్ ఉన్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడింది. ఈ అనుమతులతోపాటు వీటిలో ప్రయాణించేందుకు కొత్త మార్గదర్శకాలనూ విడుదల చేసింది. దేశీయ విమానాలకు వర్తించే నిబంధనలే వీటికీ వర్తిస్తాయని పేర్కొంది. ప్రయాణికులు ఎయిర్పోర్టు లేదా హెలిప్యాడ్, హెలిపోర్ట్కు 45 నిమిషాల ముందే చేరుకోవాలని, థర్మల్ స్క్రీనింగ్ చేసుకోవాలని తెలిపింది. వృద్ధులు, గర్భిణిలు ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. వేరే రాష్ట్రంలోకి వెళ్లే ముందు సదరు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని పేర్కొంది. ఫేస్ మాస్క్ ధరించాలని, ఆరోగ్య సేత యాప్ కూడా కలిగి ఉండాలని తెలిపింది.
Next Story