75 జిల్లాలను లాక్‌డౌన్ చేయండి : కేంద్రం

by  |
75 జిల్లాలను లాక్‌డౌన్ చేయండి : కేంద్రం
X

న్యూఢిల్లీ : దేశంలో కరోనావైరస్ కేసులు 341 చేరడంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలతో పీఎం క్యాబినెట్ సెక్రటెరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీలు ఈ రోజు ఉదయం ఉన్నతస్థాయి సమావేశాన్ని జరిపారు. ఈ సమావేశం తర్వాతే.. కోవిడ్ 19 కేసులు నమోదైన 75 జిల్లాల్లో లాక్‌డౌన్‌కు ఆయా రాష్ట్రాలు ఆదేశించాలని పీఎంవో సూచించింది. అత్యవసర సేవలు మినహా అన్ని సకలం బంద్ పెట్టాలని తెలిపింది. ఈ నెల 31 వరకు అన్ని రైళ్లు(గూడ్స్ మినహా) రద్దు చేసింది. అన్ని మెట్రో ట్రైన్ సేవలనూ సస్పెండ్ చేసింది. రాష్ట్రాల మధ్యా ప్రజా రవాణాను 31వ తేదీ వరకు నిలిపేసింది.

Tags: coronavirus, lockdown, 75 districts, PMO, march 31st, suspend, cancel



Next Story

Most Viewed