ఏపీ తీరును తప్పుబట్టిన కేంద్రం.. ఎందుకంటే !

by  |
ఏపీ తీరును తప్పుబట్టిన కేంద్రం.. ఎందుకంటే !
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కార్ తీరును కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్ విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. డీపీఆర్‌లో ప్రాథమిక అంశాలు లేవని స్పష్టం చేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ఆధారంగా రూపొందించాలని సూచన చేసింది. అటు డీపీఆర్ సమర్పణలోనూ సీడబ్ల్యూసీ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని వెల్లడించింది. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన చేసిన వచ్చిన మరుసటి రోజే రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.



Next Story

Most Viewed