కేసీఆర్ ఫ్యామిలీ మీ గోల ఆపండి.. మీరు కొన్నది 4.5 లక్షల టీకాలు.. కేంద్రం ఇచ్చింది 75 లక్షలు

by  |
కేసీఆర్ ఫ్యామిలీ మీ గోల ఆపండి.. మీరు కొన్నది 4.5 లక్షల టీకాలు.. కేంద్రం ఇచ్చింది 75 లక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉందని, సీఎం కేసీఆర్ కుటుంబం అవగాహన లేకుండా మాట్లాడొద్దని కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మమ్మల్ని వ్యాక్సిన్ కొనుక్కోనివ్వదు, కేంద్రం ఇవ్వదు అన్న మంత్రి హరీష్ రావు కామెంట్స్పై కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

మనదేశంలో తయారైన వ్యాక్సిన్ మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో తయారైన వ్యాక్సిన్ కూడా సప్లయ్ చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ నాటికి కేంద్రం మొత్తం వ్యాక్సిన్ కొనుగోలు చేసి ఇస్తుందన్నారు. ఇప్పటివరకు తెలంగాణ కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులు మాత్రమేనని కేంద్రమంత్రి కుండబద్దలు కొట్టారు. మిగతా 75లక్షల డోసులు కేంద్రమే ఉచితంగా ఇచ్చిందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Next Story

Most Viewed