వ్యాక్సినేషన్.. US,UKను అధిగమించిన ఇండియా!

by  |
వ్యాక్సినేషన్.. US,UKను అధిగమించిన ఇండియా!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాక్సినేషన్ పంపిణీలో అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ వంటి దేశాలను భారత్ అధిగమించిందని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MOHFW)ఆదివారం వెల్లడించింది. కేవలం 6 రోజుల వ్యవధిలోనే భారత్ 10మిలియన్ (పది లక్షలకు) పైగా ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా విషయానికొస్తే 10 రోజుల్లో 10లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వగా.. యూనైటైడ్ కింగ్‌డమ్ మాత్రం 18రోజుల వ్యవధిలో 10లక్షల మందికి వ్యాక్సినేషన్ పంపిణీ చేసిందని స్పష్టం చేసింది.

ఆర్థికంగా, సాంకేతికంగా మనకంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోలీస్తే భారత్ కరోనా వ్యాక్సిన్ పంపిణీలో సమర్థవంతంగా పనిచేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా స్పందించింది. కాగా, జనాభా పరంగా మనకంటే తక్కువగా ఉన్న దేశాలతో పోలిస్తే.. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


Next Story

Most Viewed