పోలవరం వ్యయం అంచనా రూ.55,548 కోట్లు

by  |
పోలవరం వ్యయం అంచనా రూ.55,548 కోట్లు
X

దిశ, ఏపీబ్యూరో : పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. 2020 ఏడాదికి గానూ వార్షిక నివేదికను కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసింది. నివేదికలో పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది.

2017-18 ధరల పట్టిక ప్రకారం పోలవరం వ్యయాన్ని రూ.55,548 కోట్లుగా అంగీకరించారు. ఇప్పటివరకు రూ.8,614 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ ఏడాది రూ.1,850 కోట్లు, వచ్చే ఏడాది 2,234 కోట్లు కేంద్రం విడుదల చేయనుంది. 2020 జనవరి వరకు పోలవరానికి కేంద్ర జలశక్తి శాఖ రూ.17,327 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.

Next Story

Most Viewed