మరో కోటీ 45 లక్షల వ్యాక్సిన్లకు కేంద్రం ఆర్డర్

by  |
మరో కోటీ 45 లక్షల వ్యాక్సిన్లకు కేంద్రం ఆర్డర్
X

దిశ,వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈనేపథ్యంలో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను అందించాలంటూ కేంద్రం సీరమ్ ఇనిస్టిట్యూట్ కు మరో కోటీ 45లక్షల వ్యాక్సిన్లను ఆర్డర్ పెట్టింది. ఇప్పటికే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా .10 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సరఫరా చేయగా, జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 63 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరికి అవసరమైన రెండో డోస్ ఇచ్చేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేస్తోంది. కాగా, ఈ టీకా డోస్ రూ. 200 చొప్పున కేంద్రం కొనుగోలు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.



Next Story

Most Viewed