సిమెంట్ డిమాండ్ 20 శాతం పెరిగే అవకాశం'!

by  |
సిమెంట్ డిమాండ్ 20 శాతం పెరిగే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: 2021-22 ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 20 శాతం వరకు పెరిగి, 2019-20ల స్థాయిలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం తెలిపింది. సరసమైన గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాల విభాగంలో రికవరీతో పాటు గ్రామీణ డిమాండ్ ఈ వృద్ధికి తోడ్పడుతుందని పేర్కొంది. 2021తో పోలిస్తే 2022లో సిమెంట్ డిమెంట్ 18-20 శాతం పెరుగుతుందని, ఇది 2019-20 స్థాయిలకు చేరుకోవచ్చని ఇక్రా ఓ ప్రకటనలో తెలిపింది.

వ్యయపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాల్యూమ్‌ల పరంగా పెరుగుదల 2021-22లో నిర్వహణ మార్జిన్‌ల పెరుగుదలకు 20-21 శాతం వరకు మద్దతునిస్తాయని అభిప్రాయపడింది. డిమాండ్ 20 శాతం వరకు పుంజుకోనున్న నేపథ్యంలో వినియోగం సైతం గతేడాది తగ్గిన 56 శాతం కనిష్ఠ స్థాయిల నుంచి 64 శాతానికి మెరుగుపడే అవకాశముందని ఇక్రా తెలిపింది.


Next Story