- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు సీఈసీ సునీల్ అరోరా స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు రెడీగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఎన్నికలపై నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి లేదన్న సునీల్ అరోరా.. ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణ చేస్తే ఆ తర్వాత ఎన్నికలకు సీఈసీ రెడీ అవుతుందని తెలిపారు. గత మూడేళ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తున్న క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరా సోమవారం కీలక వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో 2023లో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
Next Story