సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వస్తాయి: సీఐ నరేందర్ గౌడ్

by  |
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వస్తాయి: సీఐ నరేందర్ గౌడ్
X

దిశ, కీసర : సీసీ కెమెరాలతో నేరాలు అదుపులోకి వస్తాయని కీసర సీఐ నరేందర్ గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు ఈస్ట్ గాంధీనగర్, సాయికృషా కాలనీలో, సాయి ధరణి కాలనీలో రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన 75 సీసీ కెమెరాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, ఎస్ ఐ లు రామ సూర్యం, రాజు, కౌన్సిలర్లు మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, కాలనీ నాయకులు, కృష్ణారెడ్డి, శ్రీధర్, శ్రవణ్, లింగారెడ్డి,భీమ మలింగం, సుదర్శన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed