కూపీ లాగుతున్న సీబీఐ.. పులివెందులకు వివేకా కుమార్తె

by  |
కూపీ లాగుతున్న సీబీఐ.. పులివెందులకు వివేకా కుమార్తె
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసును ఛేదించేందుకు సీబీఐ నడుంబిగించింది. రెండు రోజులుగా ఈ కేసుపై కసరత్తు చేస్తోంది. తొలి రోజు ఈ కేసులో పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన వివరాలను అధ్యయనం చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారిని ప్రశ్నించి పలు వివరాలు తెలుసుకుంది. నిన్న పులివెందులలో వైఎస్ వివేకా ఇంటికి వెళ్లి సంఘటనా స్థలిని పరిశీలించింది. ఈ రోజు డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత హైదరాబాద్‌ నుంచి పులివెందుల చేరుకున్నారు. కాసేపట్లో ఆమె సీబీఐ అధికారులతో మాట్లాడనున్నారు.

Next Story

Most Viewed