- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
దుబ్బాక ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కత్తి కార్తీకపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కార్తీకపై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఓ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తానంటూ కార్తీకతో పాటు ఆమె అనుచరులు కోటీ రూపాయల మోసానికి పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అమీన్పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు కత్తి కార్తీక మధ్యవర్తిత్వం వహించినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన దగ్గర నుంచి కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నట్లు తెలిపారు. ఆమె నుంచి తన డబ్బులు ఇప్పించాలని బాధితుడు కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story