బ్రేకింగ్ న్యూస్.. పెద్దపల్లి తహసీల్దార్‌‌, సిబ్బందిపై కేసు నమోదు

by  |
బ్రేకింగ్ న్యూస్.. పెద్దపల్లి తహసీల్దార్‌‌, సిబ్బందిపై కేసు నమోదు
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయ అధికారులు వివాదంలో చిక్కుకున్నారు. తహసీల్దార్, ఆర్ఐతో పాటు మరో 9 మందిపై కోర్టు ఆదేశాలతో పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో కునారం రోడ్డు సర్వే నంబర్ 577/2లో రెండు ఎకరాల 9 గుంటల భూమి కోర్టు పరిధిలో ఉండగా.. వేరే ఒక వ్యక్తికి పట్టా చేయడంతో బాధితుడు రవీందర్ రావు కోర్టును ఆశ్రయించాడు. భూమి విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా.. కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story