సీఎం కేసీఆర్‌ను తిట్టిన వ్యక్తిపై కేసు

by  |
సీఎం కేసీఆర్‌ను తిట్టిన వ్యక్తిపై కేసు
X

దిశ, పెద్దపల్లి : సోషల్ మీడియా వేదికగా ప్రజాశాంతికి భంగం కలిగించినా, ప్రజల్లోనూ, రెండు వర్గాల్లో వైషమ్యాలు రేకెత్తిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏసీపీ ఉమెందర్ అన్నారు. గోదావరిఖనికి చెందిన పున్నం రాంచందర్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా తిడుతూ కులాల మధ్య వైశమ్యాలు సృష్టించే విధంగా పోస్టులు పెట్టాడు.

శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా, వ్యక్తుల మనోభావాలు కించపరిచేలా పోస్టులు ఉండడంతో అతనిపై Cr.no287/2021 U/sec153 (A), 504, 505 (2), 506 IPC, 67 ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ఉమెందర్ తెలిపారు.

Next Story

Most Viewed