- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖైరతాబాద్ : తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ డ్రైవర్ పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల5వ తేదీన ఖైరతాబాద్లో సదర్ ఉత్సవాల సందర్భంగా సాయి కిరణ్ వాహనం సంతోష్ అనే వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ కాలుకు తీవ్రగాయాలు అయ్యాయి. వాహనంలోనే ఉన్న సాయి కిరణ్ బాధితుడికి సాయం అందించకుండా ముందుకు వెళుతుండటంతో స్థానికులు, సంతోష్ కుటుంబ సభ్యులు కారును అడ్డుకున్నారు. అనంతరం తలసాని సాయికిరణ్ వాహనం దిగి గాయాలపాలైన సంతోష్ను కిమ్స్ ఆసుపత్రికి పంపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత వ్యక్తి సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాయి కిరణ్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Next Story