చంపుతానని బెదిరింపు.. కార్పొరేటర్ భర్తపై కేసు

by  |
చంపుతానని బెదిరింపు.. కార్పొరేటర్ భర్తపై కేసు
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ బీజేపీ కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ భర్త వేణుపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 29న రామచంద్రాపూర్ కాలనీ బైపాస్ దగ్గరలో డ్రైనేజీ పనులు చేయిస్తుండగా కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు తన ఆనుచరులతో కలిసి వచ్చి తనకు తెలియకుండా పనులెలా చేస్తారంటూ పనులను అడ్డుకున్నారు. ఇక్కడ పనులు చేస్తే చంపుతామని బెదిరించాడు. ఈ మేరకు. ఎల్లాపు రామసత్యనారాయణ ఇచ్చిన ఫిర్యదు మేరకు చొప్పరి వేణు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Next Story