ఏపీలో ఇవాళ 10,548 కేసులు..

by  |
coronavirus
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే మహారాష్ట్ర తర్వాత అత్యంత ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా ఆంధ్రప్రదేశ్ చోటుదక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే గడచిన 24 గంటల్లో 10,548 మంది కరోనా బారిన పడగా.. 82మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు వదిలారు.

తాజాగా నమోదైన కేసులతో కలిపి ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు చేరింది. అదే విధంగా తాజాగా మరణాలతో కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 3,796కు చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 97,681 యాక్టివ్ కేసులుండగా, 3,12,687 మంది చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కాగా, ఇప్పటివరకు 36,03,345 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.



Next Story

Most Viewed