నిరుద్యోగులకు తీపి కబురు.. Metro సంస్థలో ఉద్యోగాలు

by Disha Web Desk 7 |
నిరుద్యోగులకు తీపి కబురు.. Metro సంస్థలో ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై మెట్రో సంస్థల్లో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి.. జీతం ఎంత అనే విషయాలు తెలుసుకుందాం..

నోటిఫికేషన్‌లో భాగంగా.. అసిస్టెంట్, టౌన్ ప్లానర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది. ఇక వీటితో పాటు అకౌంట్స్, రోలింగ్ స్టాక్, మెటీరియల్ మేనేజ్మెంట్, పీఎస్ టీ వంటి విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నట్లు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ సంస్థ ప్రకటనలో పేర్కొంది.

ఖాళీలు-18

అర్హత- డిగ్రీ, డిప్లొమా, ఎంబీసీ, పీజీ, సీఎ ఉత్తీర్ణత సాధించాలి.

దరఖాస్తు విధానం- ఆన్ లైన్

ఎంపిక- పర్సనల్ ఇంటర్వ్యూ

చివరి తేది- 18-01-2023

వేతనం- నెలకు దాదాపుగా రూ. లక్ష వరకు వస్తుందని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది.

ఈ అవకాశాన్ని నిరుద్యోగులు వినియోగించుకోవాలని సంస్థ సూచించింది.

Also Read....

రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో 25 పోస్టులు


Next Story

Most Viewed