- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు సువర్ణావకాశం.. బీటెక్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో జాబ్స్
ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని Jobs in Indian Army

ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(OTA)లో షార్ట్ సర్వీస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అవివాహిత పురుష, మహిళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు 2022 అక్టోబర్ లో ప్రారంభమవుతుంది.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 193
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 6
*ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. SSC(టెక్) – 175, SSCW(టెక్)– 14, విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ – 02, (SSC(W) టెక్ – 01, SSC(W) (నాన్ టెక్) (UPSC కానిది) – 01) పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి బీటెక్ పాసై ఉండాలి. లేదా ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
*వయోపరిమితికి సంబంధించి 2022 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
*మరణించిన రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియ కోసం https://www.joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






