- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : నిత్యానంద స్వామి వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నాడు. గతంలో పూజల పేరిట మహిళలతో, సినీ నటితో శృంగారంలో పాల్గొన్నట్లు, భూకబ్జాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా కాంచీపురంలోని తొండైమండల అధీనం కబ్జాకు ప్రయత్నాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా ఆ మఠంలోనే తిష్టవేసిన నిత్యానంద.. ఇటీవల ఆ పీఠం పీఠాధిపతి అనుమానస్పద స్థితిలో మృతిచెందడంతో దానికి తన అనుచరుడిని పీఠాధిపతిగా చేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం. దీనిని అధీనం ప్రతినిధులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత అధీనం పీఠాధిపతి జ్ఞాన ప్రకాశ దేశిగం మృతిపట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న పీఠాన్ని ఆక్రమించేందుకు నిత్యానంద ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story