హిమాయత్‌సాగర్ వద్ద కారు బోల్తా.. ఒకరు మృతి

by  |
హిమాయత్‌సాగర్ వద్ద కారు బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం డివైడర్‌ను ఢీ కొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన కారులో గంజాయి లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

Most Viewed