ట్రక్కును ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం

by  |
accident
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున కన్నౌజ్‌ జిల్లాలోని తాల్‌గ్రామ్ వద్ద జాతీయ రహదారిపై ట్రక్కును కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జయింది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story