పాతబస్తీలో కారు బీభత్సం.. అడ్డొచ్చిన వారిని ఢీకొడుతూ..

by  |
పాతబస్తీలో కారు బీభత్సం.. అడ్డొచ్చిన వారిని ఢీకొడుతూ..
X

దిశ, చార్మినార్: పాతబస్తీలో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. శాలిబండా చౌరస్తాలో సిగ్నల్ ఎక్కడ పడుతుందో అని అత్యంత వేగంగా దూసుకు వచ్చిన కారు అదుపు తప్పి రెండు ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోను ఢీ కొడుతూ పక్కనే ఫుట్ పాత్ పైన భిక్షాటన చేస్తున్న సాలమ్మ అనే మహిళను ఢీకొట్టింది. ఈ ఘటనలో సాలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. యశ్వంత్, సల్లా ఉద్దీన్, కార్తీక్ తో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి వేగంగా వెళ్లిన కారు హరిబౌలి, బేళా చౌరస్తా, మొఘల్ పురా, వాల్టా హోటల్, ఈది బజార్ ల మీదుగా వెళ్లినట్లు పోలీసులు సి.సి కెమెరాల ద్వారా గుర్తించారు. మార్గం మధ్యలో కూడా అడ్డొచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టినట్టు పోలీసులు గుర్తించారు.



Next Story