- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కృష్ణమ్మ సాక్షిగా.. పుష్కర ఘాట్లో యువతి దారుణంగా అత్యాచారానికి గురైంది. స్నేహితుడితో కలిసి ఉన్న ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వెంట ఉన్న స్నేహితుడిపై దాడి చేసి, కాళ్లు, చేతులు కట్టేసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. శనివారం అర్ధరాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్లపై జరిగిందీ దారుణ ఘటన.
అత్యాచారం అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు పడవలో విజయవాడ వైపు పారిపోయినట్లు యువతి పేర్కొంటుంది. కీచకుల నుంచి బయటపడిన జంట.. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఆ ఫోన్ వాయిస్ రికార్ట్తోనే ఘటన బయటకు పొక్కినట్లు తెలుస్తోంది. అనంతరం వారిద్దరు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో దాడి, అత్యాచారం ఘటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కొంతమంది స్థానిక యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.