- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ 2020-21 సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 1,010.87 కోట్ల నికర లాభాలను వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 3,259.33 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. బ్యాడ్ లోన్ల కేటాయింపులు తగ్గిన కారణంగా బ్యాంకు చివరి త్రైమాసికంలో లాభాలను సాధించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బ్యాంకు స్వతంత్ర ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 21,522.60 కోట్లని, గతేడాది ఇదే సమయంలో ఇది రూ. 14,222.39 కోట్లుగా నమోదైందని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ) కేటాయింపులు రూ. 4,427.53 కోట్లకు తగ్గిందని బ్యాంకు తెలిపింది. ఇక, 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ. 2,557.58 కోట్ల లాభాలను సాధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 2,235.72 కోట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి బ్యాంకు స్థూల ఎన్పీఏలు 8.93 శాతానికి పెరిగిందని, గతేడాది ఇదే సమయానికి 8.21 శాతమని బ్యాంకు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో తెలిపింది. నికర ఎన్పీఏలు 4.22 శాతం నుంచి 3.82 శాతానికి తగ్గాయి.