జీపులో ఉన్నవారందరినీ చంపేస్తా..

by  |

లక్నో :
ఇటీవలే ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఓ పోలీసుతో మాట్లాడినట్టు భావిస్తున్న ఆడియో రికార్డ్ వైరల్ అయింది. కాన్పూర్‌లో ఎనిమిది మంది పోలీసులను హతమార్చిన తర్వాత గ్యాంగ్‌స్టర్ పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు ముందే ఓ పోలీసును బెదిరిస్తూ మాట్లాడిన రికార్డ్ ఇలా ఉన్నది. ‘నాతో పెట్టుకుంటే విధ్వంసాన్నే సృష్టిస్తా.. మొత్తం జీపులో ఉన్నవాళ్లందరినీ చంపేస్తా. జీవితమంతా జైలులో గడిపేంత హత్యలు చేస్తా. ఇప్పుడే వికాస్ దూబే వేట మొదలైంది. వాళ్లను చంపిన తర్వాతే ఇల్లు చేరుతా’ అని వికాస్ దూబే.. పోలీసు కానిస్టేబుల్‌ను బెదిరించారు.



Next Story

Most Viewed