జైలుకెళ్లే బాబు చైతన్య యాత్ర చేస్తారా?: సి.రామచంద్రయ్య

by  |
జైలుకెళ్లే బాబు చైతన్య యాత్ర చేస్తారా?: సి.రామచంద్రయ్య
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లనున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య జ్యోతిష్యం చెప్పారు. కడపలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బాబు నిర్వాకాలన్నీ బట్టబయలై జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాంటి బాబు చైతన్య యాత్ర చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బాబు నిజాయతీని చూసే రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఆయన విమర్శించారు. అవినీతి సొమ్మంతా గత ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకు బదలాయించారని ఆయన ఆరోపించారు. ఐటీ దాడుల్లో ఆధారాలతో సహా దొరికిపోవడం వల్లే చంద్రబాబు వాటిపై మాట్లాడలేకపోతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతూ, దేశ ఆర్థిక రంగం కుదేలైనా, ఎన్నో సమస్యలు వచ్చినా బీజేపీపై విమర్శలు చేయకుండా మౌనం వహిస్తున్నారని ఆయన ఎధ్దేవా చేశారు.

Next Story

Most Viewed