- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లనున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య జ్యోతిష్యం చెప్పారు. కడపలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బాబు నిర్వాకాలన్నీ బట్టబయలై జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అలాంటి బాబు చైతన్య యాత్ర చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బాబు నిజాయతీని చూసే రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని ఆయన విమర్శించారు. అవినీతి సొమ్మంతా గత ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాలకు బదలాయించారని ఆయన ఆరోపించారు. ఐటీ దాడుల్లో ఆధారాలతో సహా దొరికిపోవడం వల్లే చంద్రబాబు వాటిపై మాట్లాడలేకపోతున్నారని ఆయన విమర్శించారు. బీజేపీతో పొత్తుకోసం వెంపర్లాడుతూ, దేశ ఆర్థిక రంగం కుదేలైనా, ఎన్నో సమస్యలు వచ్చినా బీజేపీపై విమర్శలు చేయకుండా మౌనం వహిస్తున్నారని ఆయన ఎధ్దేవా చేశారు.