మార్కెట్లోకి యమహా కొత్త స్కూటర్‌!

by Disha Web Desk 17 |
మార్కెట్లోకి యమహా కొత్త స్కూటర్‌!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా తన సరికొత్త ఏరోక్స్ 155 మ్యాక్సీ-స్కూటర్ 2023 వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దాని ప్రారంభ ధరను రూ. 1.43 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. సరికొత్త స్కూటర్ బీఎస్6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చామని, వినియోగదారులకు నచ్చే మెటాలిక్ బ్లాక్, రేసింగ్ బ్లూ, గ్రే, మెటాలిక్ సిల్వర్ వంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.

అంతేకాకుండా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌తో పాటు బ్లూ-టూత్ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వచ్చింది. ఈ సరికొత్త ఏరోక్స్ 155 ఈ 20 ఇంధనంతో కూడా నడుస్తోంది. కొత్త మెటాలిక్ సిల్వర్ కలర్ ఆప్షన్ గోల్డెన్ అల్లాయ్ వీల్స్‌తో పాటు కాంట్రాస్ట్ బ్లాక్, గోల్డెన్ ఎంపికల్లో లభిస్తుంది.

Next Story

Most Viewed