ఇక మలేషియాతో మన రూపాయల్లోనే వ్యాపారం..

by Disha Web Desk 17 |
ఇక మలేషియాతో మన రూపాయల్లోనే వ్యాపారం..
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత కరెన్సీకి మరింత ఆదరణ పెరిగే అవకాశం కలిగింది. ఇక మీదట భారత్-మలేషియా మధ్య వాణిజ్య చెల్లింపులు చేయడానికి రూపాయిని ఉపయోగించవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఇంతకుముందు ఈ జాబితాలో మారిషస్, శ్రీలంక, రష్యాలు ఉండగా, ఇప్పుడు కొత్తగా మలేషియా చేరింది.

ఈ దేశాలతో ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులు చేసేటప్పుడు ఇతర కరెన్సీలతో పాటు, భారత రూపాయిని కూడా ఉపయోగించవచ్చు. ఇంతకుముందు జులై 2022 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయంగా వాణిజ్యానికి సంబంధించి చెల్లింపులను రూపాయిల్లో చేయడానికి అనుమతించింది.

ఈ నిర్ణయంతో భారత్-మలేషియా మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో పాటు, ఇప్పటి నుంచి ఇన్‌వాయిసింగ్ చెల్లింపులు, సెటిల్‌మెంట్‌లు రూపాయిల్లో జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, గ్లోబల్ ట్రెడింగ్‌కు ఇది మరింత ఉపయోగపడతుందని తెలిపింది.

మలేషియాతో రూపాయిల్లో చెల్లింపుల కోసం, "కౌలాలంపూర్‌లో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా (IIBM), భారత్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన దాని సంబంధిత బ్యాంకు ద్వారా ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను అందుబాటులోకి తెచ్చారు.

Also Read..

వరుసగా కొత్త కస్టమర్లను ఆకర్షిస్తున్న జియో, ఎయిర్‌టెల్!



Next Story

Most Viewed