సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. రూ.40కే వంట నూనె!

by Dishanational2 |
సామాన్యులకు అదిరిపోయే న్యూస్.. రూ.40కే వంట నూనె!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో నిత్యవసర వస్తువులు అనేవి తప్పని సరి. ఇక గత కొన్ని రోజుల నుంచి నిత్యవసర ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపించాయి. ముఖ్యంగా వంట నూనె మాత్రం అమాతం ఆకాశాన్ని తాకిందనే చెప్పవచ్చు. కాగా, సామాన్యులకు తీపి కబురు అందనుంది. ఏకంగా రూ.40 కే వంట నూనె పొందవచ్చు. గత కొన్ని రోజుల నుంచి వంట నూనె ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక తాజాగా వంటనూనెపై హిమాచల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.వంట నూనెపై సబ్సిడీ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. రేషన్ కార్డు ఉన్నవారికి సబ్సిడీలో తక్కువ ధరకే వంటనూనెను అందివ్వనుందంట.గతంలో ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు లబ్దిదారులకు లీటరుకు రూ.37 తక్కువ ధరకు నూనె లభిస్తుందని ఆయన చెప్పారు. లీటరుకు రూ.110కే నూనె పొందుతున్నారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed