Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 1,400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

by Kema Shiva Kumar |

ట్రంప్ యుద్ధ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. ఇవాళ సెన్సెక్స్ 1,400 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 22,250 దిగువకు చేరింది.

Stock Markets: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 1,400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్‌ (Indian Stock Markets)ను కుదిపేస్తున్నాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనతో ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ (Sensex) 1400 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. నిఫ్టీ (Nifty) 22,500 మార్క్‌ వద్ద స్థిరంగా ఉంది.

ఉదయం 9.30కి సెన్సెక్స్‌ 1454.53 పాయింట్లు కుంగి 71,679.79 వద్ద, నిఫ్టీ 453.9 పాయింట్ల నష్టంతో 22,222.50 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీలో సన్‌ఫార్మా, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, అదానీ పోర్ట్స్‌, శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు ఆసియా పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్‌ నిక్కీ 1.4శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.82శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.48శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచీ 0.5శాతం మేర కుంగాయి. అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి.మరోవైపు, గత కొన్ని రోజులుగా క్షీణిస్తోన్న రూపాయి విలువ గురువారం భారీగా బలపడింది. నేటి ట్రేడింగ్‌లో 105 పైసలు పెరిగి 93.65 వద్ద కొనసాగుతోంది. ఇక కొన్ని రోజులుగా క్షీణిస్తోన్న రూపాయి విలువ ఇవాళ భారీగా బలపడింది. నేటి ట్రేడింగ్‌లో 105 పైసలు పెరిగి 93.65 వద్ద కొనసాగుతోంది.

Next Story