తిరిగి లాభాల్లోకి మారిన సూచీలు!

by Disha Web Desk 17 |
తిరిగి లాభాల్లోకి మారిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి లాభాలను దక్కించుకున్నాయి. బుధవారం ట్రేడింగ్‌లో అమెరికా మార్కెట్ల నుంచి మద్దతుకు తోడు దేశీయ ఈక్విటీల్లో విదేశీ మదుపర్లు షేర్ల కొనుగోలు కారణంగా సూచీలు వరుస మూడు సెషన్ల నష్టాల నుంచి పుంజుకున్నాయి. వీటికితోడు గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉండటం, ముడి చమురు ధరలు గరిష్టాల వద్ద ఉన్నప్పటికీ దేశీయ పరిణామాలతో మార్కెట్లలో ర్యాలీ కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 351.49 పాయింట్లు లాభపడి 66,707 వద్ద, నిఫ్టీ 97.70 పాయింట్లు పెరిగి 19,778 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు మాత్రమే బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, ఐటీసీ, రిలయన్స్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి.

బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్, టైటాన్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.01 వద్ద ఉంది.

Next Story

Most Viewed