- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rupee: ఆగని రూపాయి పతనం
బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 111 డాలర్లను దాటగా, డాలర్ ఇండెక్స్ కూడా 99.32 స్థాయికి చేరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ కరెన్సీ రూపాయి మరింత పతనం దిశగా సాగుతోంది. సోమవారం ఉదయం ట్రేడింగ్లో రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే కొత్త రికార్డు కనిష్టం రూ. 96.25 స్థాయికి పడిపోయింది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో 96.19 వద్ద ప్రారంభమైన రూపాయి, కొద్ది సేపటికే బలహీనపడి 96.25ను తాకింది. ఇది గతవారం ట్రేడింగ్ ముగింపు స్థాయితో పోలిస్తే 44 పైసల క్షీణత. తాజా పరిణామాలు మార్కెట్లలో ఆందోళన పెంచుతున్నాయని నిపుణులు తెలిపారు. ఫారెక్స్ మార్కెట్ నిపుణుల ప్రకారం, పెరిగిన ముడిచమురు ధరలు, బలపడుతున్న అమెరికన్ డాలర్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు రూపాయిపై అధిక ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 111 డాలర్లను దాటగా, డాలర్ ఇండెక్స్ కూడా 99.32 స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడుతుండగా, భారత రూపాయి కూడా ఆ మేరకు ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.
మరోవైపు, రూపాయి బలహీనత ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా కనిపించింది. సోమవారం ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్ 1,100కుపైగా పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ కూడా భారీగా పడిపోయింది. అయితే, ఎఫ్ఐఐలు వరుసగా రెండో సెషన్లోనూ కొనుగోళ్లు కొనసాగించడం, ఐటీ షేర్లలో ర్యాలీ కొంత ఊరటనిచ్చాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 77.05 పాయింట్లు లాభపడి 75,315 వద్ద, నిఫ్టీ 6.45 పాయింట్ల స్వల్ప లాభంతో 23,649 వద్ద ముగిశాయి.






