మ్యూచువల్ ఫండ్లలో సగానికి పైగా రిటైల్ మదుపర్ల సొమ్ము!

by Dishafeatures2 |
మ్యూచువల్ ఫండ్లలో సగానికి పైగా రిటైల్ మదుపర్ల సొమ్ము!
X

ముంబై: మ్యూచువల్‌ ఫండ్స్ పరిశ్రమకు రిటైల్ ఇన్వెస్టర్లు అండగా నిలుస్తున్నారు. ఫండ్స్‌ నిర్వహణలోని పెట్టుబడుల్లో సగానికి పైగా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే వస్తోందని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ సమాఖ్య(ఏఎంఎఫ్ఐ) తాజా గణాంకాలు పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) ‘నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం)' 2023, మార్చి నాటికి గత పదేళ్లలో ఐదు రెట్లు పెరిగింది. 2013, మార్చిలో ఏయూఎం రూ. 7.01 లక్షల కోట్ల నుంచి 2023, మార్చి 31 నాటికి రూ. 39.42 కోట్లకు పెరిగింది. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు(హెచ్ఎన్ఐ) సహా వ్యక్తిగత పెట్టుబడిదారులు ఈ ఏడాది మార్చి నాటికి రూ. 23.27 లక్షల కోట్ల విలువైన మ్యూచువల్ ఫండలను కలిగి ఉన్నారు. ఇది గతేడాది కంటే 11.80 శాతం పెరిగిందని ఏఎంఎఫ్ఐ వెల్లడించింది. వ్యక్తిగత పెట్టుబడుల్లో 26 శాతం టాప్ 30 నగరాల నుంచి వచ్చాయి.

Next Story