యూజర్లకు షాకిచ్చిన ఎయిర్టెల్.. ఆ ప్లాన్ నిలిపివేత

by Naga Rani Yarlagadda |

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన యూజర్లకు ూహించని షాకిచ్చింది.

యూజర్లకు షాకిచ్చిన ఎయిర్టెల్.. ఆ ప్లాన్ నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన యూజర్లకు ూహించని షాకిచ్చింది. ఎంట్రీలెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.249ను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఆగస్టు 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. 24 రోజులకు.. రోజుకు 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ తో ఈ ప్లాన్ ఉండేది. ఇప్పుడు దానిని రద్దు చేయడంతో యూజర్లు రూ.319 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి 30 రోజులపాటు వ్యాలిడిటీ ఉంటుంది.

జియోసంస్థ ఇప్పటికే 28 రోజుల 1 జీబీ ప్లాన్ ను నిలిపివేసింది. ప్రస్తుతం రూ.299, రూ.349 ప్లాన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.299కి రోజుకు 1.5 జీబీ, రూ.349కు 2 జీబీ డేటా అందిస్తోంది. టెలికాం సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

Next Story