ప్రభుత్వ బాండ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ప్రత్యేక యాప్‌

by Dishanational1 |
ప్రభుత్వ బాండ్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ప్రత్యేక యాప్‌
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక చర్యలు తీసుకుంటోంది. రిటైల్ మదుపర్ల కోసం కొత్తగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తామని శుక్రవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ప్రభుత్వ బాండ్ల(సెక్యూరిటీ)ల్లో పెట్టుబడుల కోసం 2021, నవంబర్‌లో ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ నుంచి ప్రైమరీ, సెకండరీ మార్కెట్ ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేసే వీలుంది. వేలంలో ఈ సెక్యూరిటీలను రిటైల్ మదుపర్లు క్రయవిక్రయాలను జరపవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడుల ప్రక్రియను మరింత సులభం చేసేందుకు రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌కు చెందిన యాప్‌ను తీసుకురానుంది. యాప్ రూపకల్పన జరుగుతోందని, త్వరలో అందుబాటులోకి వస్తుందని దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ల నుంచి రూ. 14.13 లక్షల కోట్ల వరకు నిధులను సేకరించాలని భావిస్తోంది. ఇందులో మొదటి అర్ధభాగంలోనే రూ. 7.5 లక్షల కోట్ల సమీకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది.



Next Story

Most Viewed