- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్బీఐ కీలక రేట్లను మరో 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం!
ముంబై: వినియోగదారుల ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే ఎక్కువగా ఉండటం, గ్లోబల్ స్థాయిలో కఠిన పాలసీ నిర్ణయాల నేపథ్యంలో ఆర్బీఐ మరోసారి కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ మొదటివారంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తన ద్రవ్య పరపతి విధాన(ఎంపీసీ) సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం అనుకున్న లక్ష్యం 6 శాతం కంటే ఎక్కువ ఉండటంతో ఆర్బీఐ ఈ అంశానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఏప్రిల్ 3-6 తేదీల మధ్య జరగబోయే ఎంపీసీ సమావేశం వివరాలను చివరి రోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడిస్తారు. అంతేకాకుండా ఇటీవల యూఎస్ ఫెడ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను పెంచాయి. దీన్ని కూడా ఆర్బీఐ పరిశీలిస్తూనే ఎంపీసీ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. కాగా, 2022, మే నుంచి ఆర్బీఐ అధిక ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుస సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లను పెంచింది. దాంతో కీలక రెపో రేటు ప్రస్తుతానికి 6.50 శాతానికి చేరింది.