రైతులకు శుభవార్త: PM Kisan 12వ విడత డబ్బులు ఖాతాల్లోకి.. ఎప్పుడంటే

by Disha Web Desk 17 |
రైతులకు శుభవార్త: PM Kisan 12వ విడత డబ్బులు ఖాతాల్లోకి.. ఎప్పుడంటే
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అర్హులైన పేద రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా రూ. 6,000 లను మూడు విడతలుగా పంపిణీ చేస్తుంది. ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటికే 11 విడత డబ్బులను రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇప్పుడు పీఎం కిసాన్ 12 వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులు వ్యవసాయానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెట్టడంతో కేంద్ర ప్రభుత్వం 12వ విడత డబ్బులు 31 ఆగస్టు లేదా సెప్టెంబర్ 1, 2022న రైతుల ఖాతాకు బదిలీ చేయనుంది. దీని ద్వారా సన్న కారు రైతులందరికీ ఆర్థిక సహాయం అందుతుంది.


Next Story

Most Viewed