Paytm: ఏఐతో పనిచేసే ట్రావెల్ యాప్‌ను విడుదల చేసిన పేటీఎం

by S Gopi |

ఈ యాప్ ద్వారా వినియోగదారులు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు

Paytm: ఏఐతో పనిచేసే ట్రావెల్ యాప్‌ను విడుదల చేసిన పేటీఎం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం కొత్తగా ఏఐ-ఆధారిత ట్రావెల్ బుకిన్ యాప్‌ను విడుదల చేసింది. 'పేటీఎం చెక్-ఇన్' పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా వినియోగదారులు విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో టికెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా ఎక్కడికైనా ప్రయాణించాలంట్ డెస్టినేషన్ రికమెండేషన్లు ఇస్తుంది. అలాగే వ్యక్తిగత యాత్రలకు ప్రణాళికలు రూపొందించవచ్చు, బుకింగ్ మేనేజ్‌మెంట్ లాంటి సదుపాయాలు కూడా లభిస్తాయి. ఏఐ ఆధారిత ట్రావెల్ రంగంలో 'పేటీఎం చెక్-ఇన్' కీలక మైలురాయిగా నిలుస్తుందని పేటీఎం ట్రావెల్ సీఈఓ వికాస్ జలాన్ చెప్పారు. ప్రజలు మరింత అత్యాధునికంగా, స్మార్ట్‌గా ప్రయాణాలకు సిద్ధమవొచ్చు. వ్యక్తిగతంగా, సులభంగా ప్రయాణాలు చేసేందుకు ఈ యాప్ సహకరిస్తుందని, ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌తో పాటు ఐఓఎస్ యాప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు.

కొత్త పేటీఎం ట్రావెల్ యాప్‌లో ఏఐ ఎలా పనిచేస్తుందంటే..

ఈ యాప్‌లో కృత్రిమ మేధస్సు (ఏఐ) అసిస్టెంట్ ఉంటుంది. దీన్ని ఉపయోగించి వినియోగదారులు కన్వర్సేషనల్ ఇంటర్‌ఫేస్ ద్వారా ప్రయాణానికి సంబంధించి బ్రౌజ్ చేయడానికి, టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఏఐ అసిస్టెంట్ డెస్టినేషన్స్‌ను కూడా సిఫార్సు చేస్తుంది. పేటీఎం చెక్-ఇన్ ఏఐను ఉపయోగించి వినియోగదారుల గతంలో ఎంపిక చేసిన, ప్రయాణ ధోరణులకు అనుగుణంగా రిజల్ట్స్ అందిస్తుంది కంపెనీ పేర్కొంది.

Next Story