Airtelలో వాటా పెంచుకోనున్న సునీల్ మిత్తల్!

by Disha Web Desk 17 |
Airtelలో వాటా పెంచుకోనున్న సునీల్ మిత్తల్!
X

న్యూఢిల్లీ: దిగ్గజ టెలికాం భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిత్తల్ సంస్థలో తన వాటాను పెంచుకుంటున్నారు. దీనికోసం సింగపూర్ కేంద్రంగా ఉన్న టెలికాం కంపెనీ సింగ్‌టెల్‌కు ఎయిర్‌టెల్‌లో ఉన్న 3.3 శాతం వాటాను కొననున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా షేర్ల కొనుగోలు ద్వారా జరిగే ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 12,895 కోట్లుగా ఉండనుంది. ప్రమోటర్ సంస్థ అయిన భారతీ టెలికాం పేరుతో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

90 రోజుల్లోగా పూర్తయ్యే ఈ ఒప్పందం తర్వాత కంపెనీలో మిత్తల్ కుటుంబం 24.13 శాతం వాటాను కలిగి ఉంటుంది. భారతీ గ్రూప్, సింగ్‌టెల్ సంస్థల మధ్య 20 ఏళ్లుగా భాగస్వామ్యం కొనసాగుతోంది. ఇటీవల సింగ్‌టెల్ సంస్థ వ్యాపార విస్తరణతో పాటు 5జీ అమలుకు అవసరమైన మూలధన పెట్టుబడి కోసం తనకున్న కంపెనీల్లో వాటాలను ఉపసంహరించుకుంటోంది. ఇందులో భాగంగానే ఎయిర్‌టెల్‌లో వాటాను విక్రయిస్తోంది.

ఈ ఒప్పందం అనంతరం భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్ వాటా 29.7 శాతానికి, పరోక్షంగా భారతీ టెలికాం 19.2 శాతం, ఎయిర్‌టెల్‌కు 10.5 శాతం వాటాలు ఉంటాయని కంపెనీ వివరించింది.


Next Story

Most Viewed